గోధుమల ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన నిషేధాన్ని అమెరికా వ్యతిరేకించింది. ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్ భారత్ చర్య ప్రపంచ ఆరోగ్య సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గోధుముల ఎగుమతులపై నిషేధం విధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన నివేదికను పరిశీలించినట్టు ఆమె పేర్కొన్నారు. ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు విధించినా ఆహార ధాన్యాల కొరత మరింత పెరుగుతుందని తాము భావిస్తున్నామని, ఈ క్రమంలో ఎగుమతులను పరిమితం చేయొద్దని ఆయా దేశాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
……….