ప్రపంచ చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన కేన్స్ చలనచిత్రోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవాల్లో భారత్కు గౌరవ సభ్య దేశం హోదా దక్కడంతో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ నేతృత్వంలో పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలకు హాజరయ్యారు. మాధవన్, రిక్కీ కేజ్, వాణీ త్రిపాఠి, ప్రసూన్ జోషి, నవాజుద్దీన్ సిద్దిఖీ, శేఖర్ కపూర్, ఏ.ఆర్. రెహమన్..తొలి రోజున ఎర్రతివాచీపై ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఏడాది జ్యూరీ సభ్యురాలిగా దీపిక, సభ్యసాచి చీరకట్టులో ఆకట్టుకున్నారు. తమన్నా తెల్లని దుస్తుల్లో మెరిసిపోయారు. నటి ప్రముఖ మోడల్ ఊర్వశీ రౌతెలా తెల్ల గౌనులో మెరిసిపోగా విశ్వనటుడు కమల్ హాజన్ విక్రమ్ కోటలో స్రైలిష్ ఎంట్రీ ఇచ్చారు.














