ఆసియాలో శాంతియుత పరిస్థితులు ఉండాలంటే అది ఇండియా తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. కశ్మీర్లో పూర్వపు స్థితిని నెలకొల్పాలని భారత్కు పిలుపునిచ్చారు. జమ్ముకశ్మీర్లో వెంటనే 370 ఆర్టికల్ను పునరుద్ధరించాలని భారత్కు సూచించారు. ఆసియాలో సుస్థిర శాంతి కోసం 2019 ఆగస్టు 5 నాటి ఏకపక్ష, చట్టవిరుద్దమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం భారతదేశ బాధ్యత అన్నారు. కశ్మీర్ సమస్య చర్చలతో పరిష్కారమవుతుందని అన్నారు.














