అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ హోటల్ గ్రీన్పార్క్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులుగా జస్టిస్ శ్రీసుధ, శాసనమండలి సభ్యురాలు సురభి వాణి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆటా ఉమెన్స్ కో ఆర్డినేటర్ ఇందుకుమార్ లైవ్ లింక్ ద్వారా ప్రారంభోపన్యాసం చేశారు. మహిళలు అన్నిరంగాల్లో సాధికారత సాధించేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆకాంక్షించారు. జయంత్ చల్లా మాట్లాడుతూ ఆటా ఆధ్వర్యంలో భవిష్యత్లో మరిన్ని మంచి కార్యక్రమాలను తీసుకువస్తామన్నారు. ఆటా కోశాధికారి సతీశ్ రెడ్డి ఆటా సేవలను ఈ సందర్భంగా వివరించారు. ఎన్సీడీ గ్రూప్ రాయల్ పెవిలియన్ మొకిల్ల చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆటా చేస్తున్న కార్యక్రమాలు అద్భుతమని ప్రశంసించారు. ఆటా ఇండియా రిప్రసెంటేటివ్ లోహిత్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా తెలంగాణ కోఆర్డినేటర్ అమృత్ ముళ్లపూడి సహకారం అందించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/41766551-9753-415b-b545-44b631521b31-12.jpg)
జస్టిస్ శ్రీసుధ మాట్లాడుతూ కుటుంబం, విలువ, వివాహ వ్యవస్థ ఇవేవి మనం మరవొద్దని, బాధ్యతలను బట్టే మనకు జీవితంలో ప్రమోషన్ ఉంటుందన్నారు. బిడ్డగా, భార్యగా, తల్లిగా, అత్తగా, అమ్మమ్మగా ఇవన్నీ కావాల్సిందేనని, ముఖ్యంగా ఇప్పటి యువతీ యువకులు వారి ఆలోచన దృక్పథం లివింగ్ టుగెదర్ .. పిల్లలు వద్దు అనేది సమంజసం కాదన్నారు. అన్ని బాధ్యతలు పరిపూర్ణంగా నిర్వహించినప్పుడే పరిపూర్ణమైన జీవితంగా భావించాలని సూచించారు.ఇండియా మీడియా కోఆర్డినేటర్ వెంకట్రావ్ మీడియా బాధ్యతలు నిర్వర్తించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆటా ఇండియా బృందం నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/29ecb8ac-5dc5-4c41-8423-ff6f327eb1df-1.jpg)