నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా జనవరిలో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నటి మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ సోమవారం గోవాలో ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ షెడ్యూల్ 40 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సినిమాలో నాని కూతురిగా బేబీ కియారా ఖన్నా నటిస్తోంది. ఇందులో కీలక సన్నివేశాలను పిక్చరైజ్ చేస్తారని తెలుస్తున్నది. నాని కెరీర్లో ఇదొక భిన్నమైన సినిమా అవుతుందని చిత్రబృందం నమ్మకంతో ఉన్నారు.

