Namaste NRI

భారతీయ విద్యార్థినికి అరుదైన అవకాశం

రాజస్థాన్‌కు చెందిన అదితీ మహేశ్వరి భారత్‌లో బ్రిటిష్‌ దౌత్యాధికారిగా పనిచేసే అవకాశం కొట్టేసింది. హైకమిషనర్‌ ఆఫ్‌ ది డే పోటీల్లో పాల్గొని గెలుపొందిన ఆమెకు ఈ అరుదైన అవకాశం లభించింది. అక్టోబర్‌ 11న ప్రతి ఏటా అంతర్జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకుని 2017 నుంచీ భారత్‌లోని బ్రిటన్‌ హై కమిషనర్‌ ఈ పోటీని నిర్వహిస్తోంది. ఈ మారు అదితిని ఈ అద్బుత అవకాశం వరించింది. దీంతో ఆమె ఒక్క రోజు పాటు భారత్‌లో బ్రిటన్‌ దౌత్యాధికారిగా పని చేసింది. ఈ సందర్భంగా ఆమె ఓ దౌత్యాధికారి విధులు, బాధ్యతలను ఎలా ఉంటాయనేది స్వానుభవ పూర్వకంగా తెలుసుకుంది. పలు అధికారిక కార్యక్రమాల్లో బ్రిటిష్‌ కమిషనర్‌ హోదాలో అదితి పాల్గొంది. ఈ అద్భుతమైన అవకాశం తనకు లభించినందుకు అదితి ఉబ్బితబ్బిబైపోయింది. వివిధ దౌత్యాధికారులతో సమావేశాలు, షీ లీడ్స్‌ ప్రోగ్రామ్‌లో భాగమైన మహిళలను కలుసుకోవడం మర్చిపోలేని అనుభవం అని ఆమె వ్యాఖ్యానించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events