నిజామాబాద్ జిల్లాలోని కలిగోట్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. మొదట బతుకమ్మకు కవిత పూజలు చేశారు. ఆ తర్వాత స్వయంగా ఎమ్మెల్సీ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలాడుతూ ఆడబిడ్డలందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఎమ్మెల్సీ కవిత స్వయంగా బతుకమ్మ పాటలు పాడుతుంటే ఆడపిల్లలంతా కేరింత్ కొడతూ ఆటలాడారు. వేలాది బతుకమ్మ వేడుకల్లో పాల్గొనగా ఆ ప్రాంతమంతా కొత్తశోభను సంతరించుకున్నది. బతుకమ్మ వేడుకలకు దాదాపు 5వేల మందిపైగా హాజరయ్యారు.