Namaste NRI

స్వీట్లు పంచుకున్న భారత్ -పాక్ సైనికులు

దీపావళి వేడుకలు  భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దులో ఘనంగా జరిగాయి. భారత్‌, పాకిస్థాన్‌ భద్రతా బలగాలు స్వీట్లు పంచుకున్నారు. నియంత్రణ రేఖ వెంబడి తిథ్వాల్‌ వంతెనపై రెండు దేశాల సైనికులు స్వీట్లు పంచుకున్నారు. ఇదే తరహాలో అట్టారీ`వాఘా సరిహద్దుతో పాటు గుజరాత్‌, రాజస్థాన్‌లో రెండు దేశాల సరిహద్దుల్లో సైనికులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రతి ఏటా హోలీ, దీపావళి, రంజాన్‌ పండుగల వేళ రెండు దేశాల సైనికులు స్వీట్లు పంచుకోవడం సంప్రదాయంగా వస్తోంది.

Social Share Spread Message

Latest News