అమెరికా టెక్ సంస్థ యూఎస్టీ ఇండియాలో భారీ ఎత్తున నియామకాలు చేపట్టేందుకు సిద్ధమైంది. సంస్థకు చెందిన బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాల్లో 2023 కల్లా పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ ఉద్యోగులను నియమించుకోనుంది. ప్రస్తుతం యూఎస్టీ బెంగళూరు కార్యాలయంలో 6 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంఖ్యను 12 వేలకు చేర్చేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందించకుంది. వచ్చే 18` 24 నెలల్లో బెంగళూరు సెంటర్లో ఫ్రెషర్లు, అనుభవజ్ఞులను నియమించుకుంటాము. హెల్ల్కేర్, లాజిస్టిక్స్, సెమీ కండక్టర్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సిషయల్ విభాగాల్లో కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటాం అని సంస్థ ఓ ప్రకటనలో తేలిపింది. యూఎస్టీ హైదరాబాద్ శాఖలో ప్రస్తుతం 1000 మంది పనిచేస్తుండగా మరో రెండేళ్లలో అదనంగా వెయ్యి మందిని నియమించుకునేందుకు కూడా కంపెనీ సిద్ధమవుతోంది.
అమెరికాకు చెందిన యుఎస్టీ కంపెనీకి కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో ఆ కంపెనీకి మొత్తం 35 కార్యాలయాలు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, తిరువనంతపురం, కొచ్చి, పుణె, కోయింబత్తూరు, హోసూర్, ఢల్లీి నేషనల్ క్యాపిటల్ రీజియన్లో యూఎస్టీ కంపెనీకి డెడికేటెడ్ సాఫ్ట్వేర్ డెలివరీ సెంటర్లు ఉన్నాయి.