చైనాలో ఓ వింత సంఘటన జరిగింది. 33 ఏండ్ల ఓ యువకునికి తరుచూ కడపునొప్పి, మాత్రంలో రక్తం వంటి సమస్యలు వేధించే. డాక్టర్లు మొదట్లో మూత్రాశయ జబ్బుల వల్ల అలా జరుగుతున్నదని భావించారు. అపెండిసైటిస్ అనుకోని ఆపరేషన్ కూడా చేశారు. సమస్య తగ్గకపోవడంతో ఉదరాన్ని పరీక్షించారు. అతనికీ స్త్రీ, పురుష జననావయవాల రెండు ఉన్నట్లు తేలింది. పౌరుష గ్రంథితో పాటు గర్భాశయం, అండాశయాలు కనిపించడంతో డాక్టర్లు అవకాక్కయ్యారు. అరుదైన ఉభయలింగ వ్యక్తిగా అతడిని గుర్తించారు. మూత్రంలో పడుతున్న రక్తం నిజానికి రుతుస్రావమని తేల్చారు.














