Skip to main content

Namaste NRI

గంట అంతరాయం.. 25 వేల కోట్లు నష్టం

మెటా సీఈవో జుకర్‌ బర్గ్‌ మంగళవారం ఒక్క గంటలో 3 బిలియన్ల డాలర్లు (సుమారు రూ.25 వేల కోట్లు) నష్ట పోయారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సర్వీసులు మంగళవారం గంట పాటు పనిచేయలేదు. సాంకేతిక లోపం వల్ల సమస్య ఉత్పన్నమైంది. దీంతో మెటా షేర్లు క్షీణించాయి. బ్లూమ్‌బర్గ్‌ ఇండెక్స్‌లో జుకర్‌బర్గ్‌ సంపద సుమారు 3 బిలియన్లు తగ్గి 176 బిలియన్లకు పడిపోయింది. అయినప్పటికీ కుబేరుల్లో అతను నాల్గో స్థానంలో కొనసాగు తున్నాడు. మంగళవారం మెటా షేర్లు 1.6 శాతం క్షీణించాయి. ఫలితంగా జుకర్‌బర్గ్‌ నికర విలువకు కోత పడింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events