అమెరికాలో బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఏర్పడి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా డైమండ్ జూబ్లీ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇక్కడి శాంతా క్లారా కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ స్వర్ణోత్సవాల్లో ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్, శాన్ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ వైద్యులు, దాత డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డికి దాతృత్వ సింధు, జయరాం కోమటికి ప్రవాస బంధు బిరుదలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికాతో పాటు భారత్ నుంచి భారీ సంఖ్యలో అతిథులు హాజరయ్యారు.














