Namaste NRI

అంగ‌రంగ వైభ‌వంగా బాటా స్వర్ణోత్సవ వేడుక‌లు

అమెరికాలో బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) ఏర్పడి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా డైమండ్‌ జూబ్లీ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇక్కడి శాంతా క్లారా కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ స్వర్ణోత్సవాల్లో ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్‌ జనరల్‌ డాక్టర్‌ టీవీ నాగేంద్ర ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ వైద్యులు, దాత డాక్టర్‌ లకిరెడ్డి హనిమిరెడ్డికి దాతృత్వ సింధు, జయరాం కోమటికి ప్రవాస బంధు బిరుదలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికాతో పాటు భారత్‌ నుంచి భారీ సంఖ్యలో అతిథులు హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News