ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధము నేపధ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తంగా మారడంతో ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో రాష్ట్రప్రభుత్వం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు, విదేశాంగ శాఖ, సంబందిత భారత రాయబార కార్యాలయాలతో తెలంగాణ భవన్ అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు, వారు ఉన్న దేశం ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర పౌరులకు ఏదైనా ఇబ్బందులు కలిగితే కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
24×7 కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు :
+91 9871999044
+91 9958322143
+91 9910014749
+91 9643723157















