Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక నిర్ణయం .. భారత్‌పై!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపే విషయంలో రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని రిపబ్లికన్‌ సెనేటర్‌ లిండ్సే గ్రాహమ్‌ వెల్లడించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, రష్యా నుంచి చమురు , యురేనియం కొనుగోలు చేసే భారత్‌, చైనా, బ్రెజిల్‌ వంటి దేశాలపై 500 శాతం వరకూ సుంకాలు విధించనున్నారు. ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్‌ జరగనున్నట్లు లిండ్సే గ్రాహమ్‌ తెలిపారు.

రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తూ ఉక్రెయిన్‌తో యుద్ధానికి నిధులు సమకూరుస్తున్న భారత్‌, చైనా, బ్రెజిల్‌ దేశాలను కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన కీలక సమావేశం అనంతరం లిండ్సే గ్రాహమ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. గత కొన్ని నెలలుగా డెమోక్రాట్‌ సెనేటర్‌ రిచర్డ్‌ బ్లూమెన్‌థాల్‌తో కలిసి తాను పనిచేస్తున్న రష్యా ఆంక్షల బిల్లుకు ట్రంప్‌ అనుమతి ఇచ్చారని ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌ శాంతి చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ బిల్లు తీసుకురావడం వ్యూహాత్మకంగా సరైన సమయమని గ్రాహమ్‌ అభిప్రాయపడ్డారు.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events