రష్యాతో యుద్ధం కారణంగా అర్థంతరంగా భారత్కు వచ్చిన వైద్య విద్యార్థులను ఉక్రెయిన్ దేశం మళ్లీ మర్మని పిలుస్తోంది. తదుపరి సెమిస్టర్ క్లాసును సెప్టెంబర్ 1న ప్రారంభించనున్నామని, విద్యార్థులు వచ్చే వారంలోగా నిర్ణయం తీసుకోవాలని మెడికల్ యూనివర్సిటీలు సూచించాయి. అయితే తరగతులకు హాజరు విషయంలో పలు ఆఫ్షన్లు కూడా వచ్చాయి. రిస్క్కు సిద్ధపడి క్యాంపస్కు రావడం, తాత్కాలికంగా ఆన్లైన్ క్లాసులకు హాజరు కావడం, ఇతర దేశాల్లోని వర్సిటీల్లో చేరడం అనే ఆప్షన్లలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలని పేర్కొంది.














