
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక పురోగతి లభించింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి తో భారత ప్రభుత్వం జరిపిన విస్తృత చర్చలు సఫలీకృతమవడంతో, భారతీయ ఉత్పత్తులపై ప్రతిపాదించిన అదనపు సుంకం తగ్గుముఖంట్టింది. ప్రారంభంలో 12.5 శాతంగా ప్రతిపాదించిన అదనపు సుంకాన్ని 10 శాతానికి తగ్గించడమే కాకుండా, భారత్ చేసే మొత్తం ఎగుమతుల్లో 45 శాతం ఉత్పత్తులకు ఈ అదనపు టారిఫ్ భారం నుంచి మినహాయింపు లభించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.





























