Skip to main content

Namaste NRI

 ప్రవాసులకు కువైత్ షాక్   

గల్ఫ్ దేశం కువైత్  ఉద్యోగావకాశాల్లో స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో 2017లో  కువైటైజేషన్ పాలసీని  తీసుకొచ్చింది. ప్రవాసుల ప్రాబల్యం రోజురోజుకూ పెరిగిపోతుండడంతో కువైటీలకు ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారిందని భావించిన కువైత్ సర్కార్ ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి అటు ప్రభుత్వ రంగంతో పాటు ఇటు ప్రైవేట్ రంగంలోని ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు ఇస్తూ వస్తోంది. ఇదే సమయంలో దశలవారీగా ప్రవాస ఉద్యోగులపై వేటు వేయడం చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా విద్యాశాఖ 100శాతం కువైటైజేషన్‌ను సాధించిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. కువైటైజేషన్ అమలులోకి వచ్చిన 2017 జనవరి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 2,048 మంది ప్రవాస ఉద్యోగులను  తొలగించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో 629 మంది కువైటీలను కొత్తగా ఉద్యోగాల్లో తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ శాఖలో 100 శాతం ఉద్యోగులు కువైత్ పౌరులేనని స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News