Namaste NRI

దుబాయ్‌లో హిందూ ఆలయం ప్రారంభం

దుబాయ్‌లో హిందువుల కోసం ప్రత్యేకంగా పాలరాతితో నిర్మించిన దేవాలయం సందర్శకులను ఆకట్టుకుంటోంది. దుబాయ్‌లోని జెబెల్‌అలీలో నిర్మించిన ఈ దేవాలయానికి ప్రత్యేకతలున్నాయి. ఈ దేవాలయాని దుబాయ్‌ మంత్రి షేక్‌ నహ్యాన్‌ బిన్‌ ముబారక్‌ అల్‌ నహ్యాన్‌ ప్రారంభించారు. 9 మతపరమైన పుణ్యక్షేత్రాలను కలిపి ఆరాధాన గ్రామం పేరుతో ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో 16 దేవతా విగ్రహాలుండగా, శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహం భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. మందిరంలో మధ్యలో ఏర్పాటు చేసిన పెద్ద 3డీ ప్రింటెడ్‌ తామరపువ్వు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఆలయంలోనే సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్‌ సాహిబ్‌ సైతం ఉంది.
దుబాయ్‌కు వెళ్లే భారతీయుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నందున మన దేశంతో ఉన్న అనుబంధాన్ని చాటుకునేలా యూఏఈ పాలకులు ఈ ఆలయాన్ని నిర్మించారు. వివిధ దేశాల నుంచి తెచ్చిన పాలరాతితో కట్టిన దేవాలయం భక్తులను ఆకర్షిస్తోంది. ఆలయాన్ని అనుమతులతో పాటు నిర్మాణంలోనూ యూఏఈ పాలకులు సహాయం అందించారు. ఈ గ్రామంలో ఏడు చర్చిలు, ఒక గురుద్వారా ఉండగా.. తాజాగా హిందూ ఆలయం కూడా భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో దుబాయ్‌ మంత్రి షేక్‌ నయాన్‌ బిన్‌ ముబారక్‌, యూఏఈలోని భారత రాయబారి సంజయ్‌, వివిధ మతాల నాయకులు, యూఏఈ ప్రభుత్వ ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events