Namaste NRI

స్వర లయ ఆర్ట్స్‌ సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో  శ్రీగురు కళాంజలి

సింగపూర్‌లో గురు కళాంజలి కార్యక్రమం ఆధ్యంతం అద్వితీయంగా సాగింది. స్వర లయ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వర లయ ఆర్ట్స్‌ విద్యార్థులైన బొమ్మకంటి అనన్య, షణ్మిత తంగప్పన్‌ ప్రార్థనాగీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలిండియా రేడియో ఆర్టిస్ట్‌ పప్పు పద్మా రవిశంకర్‌ వీణావాదనతో అందర్నీ మంత్రముగ్దుల్ని చేయగా, ఆమె తనయులు జ్ఞానదేవ్‌, జయదేవ్‌లు వయోలిన్‌, మృదంగ సహకారంతో సాగిన ఈ సంగీతరaురి మరింత రక్త కట్టింది. స్వర లయ ఆర్ట్స్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషు కుమారి మాట్లాడుతూ కళాకారుల ప్రదర్శనలతో పాటు, వారి గురువుల కళావిశిష్టత, వైవిధ్యం మొదలైన అంశాలపై చర్చలతో విజ్ఞానవంతముగా ముందుతరాలకు ఉపయుక్తంగా రూపొందించబడిరదని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత సుధానిది గుమ్ములూరి శారద సుబ్రహ్మణం,  రాధిక నడదూరు, విద్యాధరి, సౌభాగ్యలక్ష్మి రాజశేఖర్‌, కవుటూరు లలితా రత్నకుమార్‌, బొమ్కకంటి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News