Namaste NRI

జపాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌ పర్యటన భారత రక్షణ వ్యవస్థని మరింత బలోపేతం చేసేందుకు కీలకంగా మారనుంది. భారత్‌కు క్షిపణులు, జెట్‌లతో సహా శక్తివంతమైన సైనిక పరికరాలను ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది జపాన్‌ ప్రభుత్వం. టోక్యోలో జరిగిన సమావేశంలో రక్షణ తయారీతో సహా ద్వైపాక్షిక భద్రత, రక్షణ సహకారాన్ని మెరుగుపరచడానికి క్యాడ్‌ సమ్మిట్‌లో భాగంగా ప్రధాని మోదీ, జపాన్‌ ప్రధాని వ్యూమియో కిషిదాను కలిసిన సంగతి తెలిసిందే. ఈ  సమావేశం జరిగిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం జరగడం విశేషం.

                 గతంలో దాదాపు 47 సంవత్సరాల తర్వాత 2014లో జపాన్‌ ప్రధాని షింజో అబే పరిపాలన రక్షణ ఎగుమతులను నిషేధించే నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ ఇది ఇప్పటికీ ప్రాణాంతక ఆయుధాల ఎగుమతులను నిషేధిస్తుంది. తాజాగా జపాన్‌ ప్రభుత్వం ఈ చట్టానికి మరిన్ని సడలింపులు తీసుకురానుంది. దీని ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. జపాన్‌ స్వీయ` రక్షణ దళాలు, భారత సైన్యం మధ్య ఆక్విజిషన్‌ క్రాస్‌ సర్వీసింగ్‌ అగ్రిమెంట్‌ సెప్టెంబర్‌ 2020లో పలు ఒప్పందాలు జరిగాయి. కాగా, భారతదేశం, ఆస్ట్రేలియాతో పాటు కొన్ని యూరోపియన్‌, ఆగ్నేయాసియా దేశాలకు ఆయుధాలను ఎగుమతులు చేయడానికి జపాన్‌ ప్రభుత్వ ఆ దేశ ఆయుధాలపై ఎగుమతులపై ఉన్న నిబంధనలను సడలించనుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events