శ్రీలంక ప్రధానిగా రణీల్ విక్రమ సింఘే పదవీ బాధ్యతలు చేపట్టారు. తమ దేశం ఇబ్బందుల్లో వున్న సమయంలో భారత్ తమకు సహాయం చేసిందని, అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని విక్రమ సింఘే తెలిపారు. భారత్తో తాను సన్నిహిత సత్సంబంధాలనే కోరుకుంటున్నానని, ఆ దిశగానే పని చేస్తానని ప్రకటించారు. ప్రజాస్వామ్య బద్దంగా, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము కూడా రెడీ ఉన్నామని భారత్ స్పందించింది. శ్రీలంక ప్రజానీకానికి అవసరమైన సహాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చింది.














