సింగపూర్లో భారత సంతతి వ్యక్తి విపుల్ చావ్లాకు అరుదైన గౌరవం లభించింది. సింగపూర్ కంపెనీ ఫెయిర్ప్రైస్ గ్రూప్ సీఈవోగా నియామకం అయ్యారు. ఫెయిర్ప్రైస్ గ్రూప్ సీఈవోగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న సీ కియాన్ పెంగ్ ఏప్రిల్లో ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 5న చావ్లా సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని ఫెయిర్ ప్రైస్ గ్రూప్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడిరచింది. ఫిజికల్ స్టోర్లు, ఆన్లైన్ రిటైల్ వృద్ధిని వేగవంతం చేయడంలో పెంగ్ వ్యూహాలను చావ్లా కొనసాగిస్తారని ఫెయిర్ ప్రైస్ తన ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేసింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)