Namaste NRI

రక్షణశాఖ కీలక నిర్ణయం…వారిని కాల్చిపారేయండి

శ్రీలంక రక్షణమంత్రిత్వశాఖ కీలకమైన నిర్ణయం తీసుకుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా చెలరేగిన అల్లుర్లు, తీవ్ర పర్యవసనాల నేపథ్యంలో ప్రజా ఆస్తులకు నష్టం లేదా ఇతరుల ప్రాణాలకు హాని కలిగిస్తున్న వ్యక్తులను కాల్చిపడేయాలని త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శ్రీలంక రక్షణమంత్రిత్వ శాఖ ప్రతినిధి నలిన్‌ హెరాత్‌ ప్రకటించారు. మరోవైపు తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో వారెంట్‌ లేకుండానే వ్యక్తులను అరెస్ట్‌ చేసేందుకు మిలటరీ, పోలీసులకు ఆ దేశం ఎమర్జెన్సీ అధికారులు అప్పగించింది.  తీవ్రమైన అల్లర్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.  సంక్షోభంలో ఉన్న శ్రీలంకను కొత్త  ప్రభుత్వం నడిపించాలని నిరసనకారులతోపాటు కీలకమైన వాణిజ్య గ్రూపులు కూడా కోరుతున్నాయి. అల్లర్లలో ఇప్పటికే 8 మందికి పైగా చనిపోగా, 200లకు పైగా మంది గాయపడ్డారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events