జైజాస్తి, అనంతిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రాజమండ్రి రోజ్ మిల్క్. వెన్నెల కిషోర్, ప్రవీణ్, ప్రణీత్ పట్నాయక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్లుక్లో చిత్రం హీరో, హీరోయిన్లను ఎవరనేది తెలియజేసింది. ఈ చిత్రం ఫస్ట్లుక్ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. దర్శకుడు నాని చిత్ర విశేషాలను తెలియజేస్తూ పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ యూత్పుల్ ఎంటర్టైనర్ అందరికి కాలేజీ రోజులను గుర్తు చేస్తుంది. కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను ఈ చిత్రం జ్ఞపిక్తి తెస్తుంది న్నారు. నిర్మాత మాట్లాడుతూ జూన్ నుంచి రెండవ షెడ్యూల్ను రాజమండ్రి, వైజాగ్లో చిత్రీకరిస్తాం. సెప్టెంబర్లో విడుదల చేస్తాం అన్నారు. నాన్ని బండ్రెడ్డి దర్శకుడు. సురేష్ ప్రొడక్షన్స్తో కలిసి ఇంట్రూప్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. డి.సురేష్బాబు, ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతలు. ఈ చిత్రానికి గోవింద్ వసంత్, అజయ్ అరసాడ, యశ్వంత్ నాగ్, భరత్ సౌరభ్లు సంగీతాన్ని అందిస్తున్నారు. ముఖేష్, శక్తి అరవింద్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు.
