పాకిస్థాన్కు చెందిన సైదా షెహనాజ్ బీజీ తనకు న్యాయం చేయలేకపోతే భారత్కు అయినా పంపాలని లాహోర్ హైకోర్టును వేడుకున్నది. పాకిస్థాన్లోని బహవల్నగర్కు చెందిన ఆమె తన 1,400 చదరపు అడుగుల ఇంటిని కబ్జాదారుల నుంచి తిరిగి ఇప్పించాలని పోరాడుతూ ఉన్నది. కోర్టుల చుట్టూ దశాబ్దాలుగా తిరిగినా ల్యాండ్ మాఫియా చేతులో నుంచి నా ఇంటిని తిరిగి ఇప్పించకపోతే దేశంలో ఉండటంలో అర్థమే లేదు అని ఆమే ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్లో ఉంటే తనకు న్యాయం జరగడం లేదు కాబట్టి తనను భారత్కు పంపించాలని ఆమె వేడుకున్నారు.














