Skip to main content

Namaste NRI

భారత్‌ తప్ప మరో దేశం చేయలేదు

భారత్‌ తప్ప మరే దేశమూ సాయం చేయడం లేదని శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమ సింఘె పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తమ దేశానికి ఆర్థిక సహాయ కార్యక్రమాలను వేగవంతం చేయాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి  (ఐఎంఎఫ్‌) డైరెక్టర్‌ క్రిస్టలీనా జార్జివాను కోరినట్లు తెలిపారు. శ్రీలంక విద్యుత్‌ సంస్థ సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు సిబ్బంది  తలపెట్టిన సమ్మె గురించి మాట్లాడుతూ విద్యుత్‌ సేవలకు అంతరాయం కలిగించొద్దని సూచించారు. అలా కాదని మీరు సమ్మె చేస్తే ఇకపై భారత్‌ను సాయం కోసం ఆర్థించమని నన్ను అడగొద్దు. చమురు బొగ్గుకు భారత్‌ తప్ప ఇంకే దేశమూ మనకు సాయం అందించడం లేదు అని అన్నారు.

Social Share Spread Message

Latest News