త్రిగుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కిరాయి. వీఆర్కే (రామకృష్ణ) దర్శకుడు. అమూల్యా రెడ్డి యలమూరి, నవీన్ రెడ్డి ఉయ్యూరు నిర్మాతలు. పాయల్ హీరోయిన్గా నటిస్తుంది. త్రిగుణ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్లుక్ను దర్శకుడు హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ గుంటూరు నేపథ్యంలో 1995, 2003 కాలం నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. కిరాయి తీసుకోకుండా హీరో ఓ కిరాయి హత్య చేయవలసి వస్తుంది. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది. ఇలా వరుస హత్యలు ఎందుకు చేస్తారు? ఈ క్రమంలో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది ఈ చిత్ర కథ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ హూ ఓల్టేజ్ యాక్షన్ చిత్రమిది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరిగౌర.














