ఎల్ఏసీ వెంట శాంతి కోసం భారత్తో కలిసి పని చేస్తున్నామని చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెంఘే తెలిపారు. సింగపూర్లోని షాంగ్రీ`లా చర్చల్లో ఆయన మాట్లాడారు. రెండు పొరుగు దేశాలన్నీ సత్సంబంధాలు కొనసాగించడం భారత్, చైనాకు ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. దక్షిణ చైనా సముద్రంతో సహా ప్రాదేశిక వివాదాలను పరిష్కరించుకునేందుకు శాంతియుత మార్గాలపై పిలుపునిచ్చారు. భారత్ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంట వివాదంపై ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ మేం భారత్తో కమాండ్ స్థాయిలో 15 రౌండ్ల చర్చలు జరిపాం. ఈ ప్రాంతంలో శాంతి కోసం కలిసి పనిచేస్తున్నాం అని బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్లోని ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ తన్వి మదన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.














