భారత సంతతికి చెందిన రాధా అయ్యంగార్ ప్లంబ్ను అమెరికా ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. ఆమెను రక్షణ శాఖ ఉప సహాయ మంత్రిగా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. ఆమె ఆయుధ, వస్తు సేకరణ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఇందుకు ముందు రక్షణ శాఖ ఉపమంత్రి కార్యాలయ సిబ్బంది అధిపతిగా ఆమె పనిచేశారు. గూగుల్, ఫేస్ బుక్ కంపెనీలలో ఉన్నత సాంకేతిక పదవులు నిర్వహించారు. రాధా ప్లంబ్ ఆర్థికవేత్త కూడా.














