Namaste NRI

దర్శకుడు సంపత్‌ నంది కొత్త చిత్రం ఖరారు

మాస్‌ పల్స్‌ను ఖచ్చితంగా అంచనా వేసి విజయాలు దక్కించుకోవడం సాధారణ విషయం కాదు. అందులో నిష్ణాతుడిగా పేరు తెచ్చుకున్నారు అగ్ర దర్శకుడు సంపత్‌నంది.  ఆయన కొత్త చిత్రం ఖారారైంది. సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సినిమా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ తుదిమెరుగులు దిద్దుకొంటోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమాని త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. మాస్‌ కథలు, అంశాలతో సినిమాలు తీసే దర్శకుడు సంపత్‌ నంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. సాయితేజ్‌ ఇప్పటి వరకూ చేయని ఓ కొత్త లుక్‌లో కనిపిస్తారని సంపత్‌నంది తెలిపారు. త్వరలో సెట్స్‌మీదకు తీసుకొస్తామని చిత్రబృందం పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events