నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం థ్యాంక్యూ. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు విక్రమ్ కె కుమార్ రూపొందిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ సినిమా జూలై 22న విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఫేర్ వెల్ అంటూ సాగ్ పాటను హైదరాబాద్లోని ఓ కాలేజీలో విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ఐదో తరగతి వరకు అమ్మానాన్నతో ఉంటాం. ఆ తర్వాత స్కూల్మేట్స్తో కలుస్తాం. ఆ తర్వాత అంతా కళాశాల జీవితమే. అంత అనుబంధమున్న కాలేజీ లైఫ్ను వదిలేసి వెళ్తుంటే ఎంత భావోద్వేగానికి గురవుతామో ఈ ఫేర్ వెల్ పాట ద్వారా చెప్పాం అన్నారు. ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది అన్నారు విక్రమ్ కె. కుమార్. మూడేళ్లు థ్యాంక్యూ కోసం కష్టపడ్డాం. రిజల్ట్ కోసం వేచి చూస్తున్నాం అన్నారు నాగచైతన్య. తమన్ మాట్లాడుతూ ఫేర్వెల్ సాంగ్ సినిమాలో మంచి సందర్భంలో వస్తుంది. ఈ పాట చూశాక మీరు ఉద్వేగానికి గురవుతారు అన్నారు. ఈ సినిమాలో చైతూను చూస్తుంటే నాగార్జునను చూసినట్లు అనిపించింది అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)