అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరికొద్ది రోజుల్లో సౌదీ అరేబియాకు వెళ్లనున్న నేపథ్యంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్పై ఆ దేశ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి సాద్ అల్ జాబ్రి షాకింగ్ ఆరోపణలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిరాయి సైనికులతో టైగర్ స్క్వాడ్ అనే దళాన్ని కూడా నడుపుతున్నాడని తెలిపారు. ఈ దశం ప్రత్యేకంగా కిడ్నాపులు, హత్యలు చేస్తుందని ఆరోపించారు. ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని ఓ ఉన్మాది అని అన్నారు. భావోద్వేగాలు లేని కఠినాత్ముడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. యువరాజు సల్మాన్ చేసిన హత్యలకు, నేరాలకు తామే సాక్షులమని కుండబద్దలు కొట్టారు. యువరాజు బాగా ధనవంతుడు కావడంతో అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఓ ముప్పులా పరిణమించాడని సంచలన ఆరోపణలు గుప్పించాడు. ఆయన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా పెను దుమారానికి దారి తీశాయి.














