కేరళకు చెందిన లైబా అబ్దుల్ బాసిత్కు ప్రస్తుతం 11 ఏళ్లు. దోహాలోని ఆలీవ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 6వ గ్రేడ్ చదువుతోంది. చిన్న పిల్లలను ఉద్దేశించి పాంటసీలో స్టోరీలతో మూడు పుస్తకాలు రాసి ఆర్డర్ ఆఫ్ ది గెలాక్సీ బుక్ సిరీస్ను ప్రచురించింది. దీంతో బుక్ సిరీస్ను ప్రచురించిన అతి పిన్న వయస్కురాలిగా గిన్నీ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఈమె రాసిన పుస్తకాలు ఈ కామర్స్ వెబ్సైట్లు, ప్రముఖ బుక్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.














