బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఈ రేసులో తనను తాను అండర్డాగ్గా అభివర్ణించుకున్నారు. సెంట్రల్ ఇంగ్లండ్ గ్రాంథమ్లో కార్యక్రమానికి హాజరైన రిషి ఈ వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా తాను గట్టి పోటీ ఇస్తానని పేర్కొన్నారు. కొన్ని శక్తులు తనతో పోటీపడుతున్న వ్యక్తికి పట్టాభిషేకం జరగాలని కోరుకుంటున్నాయని అన్నారు. కానీ నిర్ణయం టోరీ (కన్జర్వేటివ్ పార్టీ) సభ్యుల చేతుల్లో ఉంటుందని చెప్పారు. ఎవర్ని గెలిపించాలో నిర్ణయించుకునేందుకు వారికి ఇంకా చాలా సమయం ఉందని వ్యాఖ్యానించారు. రిషి సునాక్ పోటీ పడుతున్న లిజ్ ట్రస్కే టోరీ సభ్యులు పట్టం గడుతున్నారని యూగో సర్వే వెల్లడిరచింది. రిషిపై ట్రస్ 24 శాతం పాయింట్ల లీడ్లో ఉన్నట్లు ఆ పోల్ అంచనా వేసింది.














