తాను బ్రిటన్ ప్రధాని అయితే చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని ప్రధాని పదవి కోసం పోటీ ఉన్న అభ్యర్థి భారత సంతతికి చెందిన రిషి సునాక్ అన్నారు. యూకే జాతీయ, అంతర్జాతీయ భద్రతకు చైనా నుంచి ముప్పు ఉందని పేర్కొన్నారు. చైనా గూఢచారులను ఎదుర్కోవడానికి యూకే గూఢచార వ్యవస్థను ఉపయోగించాలని డిమాండ్ చేశారు. పదవి చేపట్టిన వెంటనే డ్రాగన్ కోరలు పికుతానని ప్రకటించారు. అంతేకాదు, దేశంలోని కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్లను కూడా పూర్తిగా మూసేయాలని సూచించాడు.














