ప్రపంచంలోని చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం నిత్యం పెరుగుతూ వెళ్తున్నది. సవాల్ విసురుతోతన్న ద్రవ్యోబల్బణంపై దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో మాంద్యంపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యంలో మాంద్యం రాబోదన్నారు. నా దృష్టిలో మే ప్రస్తుతం మాంద్యంలోకి వెళ్లడం లేదు. అమెరికాలో నిరుద్యోగ రేటు ఇప్పటికీ చరిత్రలో అత్యల్పంగా ఉంది. ఇది కేవలం 3.6 శాతంలోనే ఉన్నది. ఈ సందర్భంగా భారత్పై బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ మినహా చాలా పెద్ద దేశాలు మాంద్యం బారినపడుతుయన్నారు. ఇప్పటికే ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటున్న చాలా ఆసియా దేశాలు మాంద్యం బారినపడే ప్రమాదం ఉందని ఇటీవల బ్లూమ్బర్గ్ నిర్వహించిన సర్వేలో తెలింది.














