అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్కు వెళ్తే, అప్పుడు ఆ దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదని చైనా వార్నింగ్ ఇచ్చింది. పెలోసీ మలేషియాలో గడిపారు. ఆసియా టూర్లో ఉన్న నాన్నీ తైపెయి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తైవాన్ తమ భూభాగం చైనా భావిస్తోంది. ఆ ప్రాంతానికి నాన్సీ వెళ్లడాన్ని రెచ్చగొట్టే చర్యగా భావిస్తామని చైనా పేర్కొన్నది. తైవాన్ అంశంలో అమెరికా, చైనా మధ్య కొన్నాళ్ళ నుంచి ఉద్రిక్తతలు నెలకొన్నాయి.














