నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్గా వస్తున్న కార్తికేయ 2 చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. అద్బుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. దర్శకుడు చందూ ఈ సినిమా అత్యద్భుతమైన విజువల్ ఫీస్టుగా తెరకెక్కిస్తున్నాడని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ కి జంటగా నటిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాని క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 13న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.














