భారత్, చైనా సైనికుల మధ్య సరిహద్దులో మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. హిమాలయ ప్రాంతంలోని లడఖ్ వద్ద భద్రతకు సంబంధించిన ఒక నివేదిక ఈ మేరకు పేర్కొంది. ఈ ప్రాంతంలో సైనికపరమైన మౌలిక సదుపాయాలను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) పెంచుతుండటం ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలకు దారితీయవచ్చని అంచనా వేసింది. సరిహద్దు ప్రాంతాల్లో స్థానిక పోలీసులు సేకరించిన నిఘా సమాచారం, భారత్-చైనా మధ్య గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఘర్షణల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఘర్షణలు, ఉద్రిక్తతల నమూనాను విశ్లేషిస్తే, 2013-14 నుంచి ప్రతి రెండు మూడేళ్లకు ఉద్రిక్తతల తీవ్రత పెరుగుతున్నది. ఇరు దేశాలు పోటాపోటీగా సైనిక మౌలిక నిర్మాణాలు చేపట్టడంతోపాటు బలగాలను పెంచుకుని బలాబలాలను పరీక్షించుకుంటున్నాయి్ణ అని అందులో పేర్కొన్నారు.














