Namaste NRI

సనాతన ధర్మంపై.. అమెరికాలోని ఓ నగరం కీలక నిర్ణయం

ఒక పక్క భారత్‌ దేశంలో సనాతన ధర్మంపై వాడీవేడి చర్చలు, విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతుండగా, మరోవైపు అమెరికాలోని ఒక నగరం సెప్టెంబర్‌ 3వ తేదీని సనాతన ధర్మ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. యూ ఎప్‌ కెంటకీలోని లూయిస్‌విల్లే మేయర్‌ క్రెగ్‌ గ్రీన్‌బర్గ్‌ దీనిని ప్రకటించారు. కెంటెకీలోని ఒక హిందూ దేవాలయంలో జరిగిన మహా కుంభాభిషేక కార్యక్రమం లో మేయర్‌ తరఫున డిప్యూటీ మేయర్‌ బార్బరా సెక్స్‌టన్‌ స్మిత్‌ మాట్లాడుతూ ఏటా లూయిస్‌విల్లేలో సెప్టెంబర్‌ 3న సనాతన ధర్మ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చిదానంద సరస్వతి, రిషికేష్‌, రవిశంకర్‌, భగవతి సరస్వతి, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ జాక్విలిన్‌ కోల్‌మన్‌ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events