తాజాగా జరిగిన బోర్డ్ సమావేశంలో ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులను తోసిపుచ్చుతూ, కొత్తగా ఎన్నికైన బోర్డ్ సభ్యులను, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల నియామకాలకు బోర్డ్ ఆమోదముద్ర వేసింది. మార్చి 1వ తేదీ నుంచి కొత్త బోర్డ్, పాలకవర్గం సభ్యులు బాధ్యతలు స్వీకరిస్తారని ప్రస్తుత తానా బోర్డ్ చైర్మన్ హనుమయ్య బండ్ల సభ్యు లకు పంపిన లేఖలో పేర్కొన్నారు. 29వ తేదీన బోర్డ్ సమావేశం జరిగిందని, అందులో ఎన్నికల ఓటింగ్ పై వచ్చిన ఫిర్యాదులపై చర్చించి వాటిని తోసిపుచ్చడంతోపాటు, ఎన్నికల కమిటీ పంపిన రిజల్ట్ను పరిగణ లోకి తీసుకుంటూ, కొత్తగా ఎన్నికైన సభ్యుల ఎన్నికు అధికారికంగా బోర్డ్ ఆమోదముద్ర వేసినట్లు హనుమయ్య బండ్ల తాను పంపిన లేఖలో తెలియజేశారు. బోర్డ్ ఆమోదముద్ర వేయడంతో ప్రెసిడెంట్ ఎలక్ట్గా నరేన్ కొడాలితోపాటు ఆయన టీమ్ బాధ్యతలను చేపట్టినట్లయింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)