![](https://namastenri.net/wp-content/uploads/2024/07/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-47.jpg)
అమెరికా అధ్యక్ష ఎన్నికలునవంబర్లో జరగనున్నాయి. అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి ఈవీఎంల వాడకానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఈవీఎంల కన్నా పేపర్ బ్యాలెట్ మేలని నొక్కి చెప్పారు.ఈవీఎంలు, మెయిల్ చేసిన ఏ విషయమైనా చాలా రిస్క్తో కూడుకు న్నది. మనం పేపర్ బ్యాలెట్నే అనుసరించాలి అని మంగళవారం ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ విషయా నికి మద్దతుగా ఈవీఎంల గురించి కొన్ని అమెరికా వార్తా కథనాలను జత చేశారు. అయినా చాలా మంది ఎక్స్ వినియోగదారులు అతడి సిద్ధాంతానికి మద్దతు ఇవ్వలేదు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/07/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-43.jpg)