మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆదిపర్వం. శివ కంఠంనేని, ఆదిత్య ఓం, ఏస్తర్ నోరోనా తదితరులు ఇతర ప్రధాన పాత్రల్ని పోషించారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సంజీవ్ మోగోటి దర్శకత్వం వహించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేశారు. ఈ సినిమాలో మంచు లక్ష్మి నాగులాపురం నాగమ్మగా శక్తివంతమైన పాత్రలో కనిపిస్తుందని, ఆమె చేసిన యాక్షన్ సన్నివేశాలు హైలైట్గా నిలుస్తాయని, పీరియాడిక్ డ్రామాగా ప్రేక్షకులను మెప్పిస్తుందని దర్శకుడు తెలిపారు.
పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నామని నిర్మాత ఎమ్.ఎస్.కె తెలిపారు. అద్భుత మైన సోషియో ఫాంటసీ కథాంశమిదని, తన పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుందని, యాక్షన్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డానని మంచు లక్ష్మి పేర్కొంది. ఈ కార్యక్రమంలో చిత్ర తారగణం అందరూ పాల్గొన్నారు.