Namaste NRI

ఎన్నారై టీడీపీ రూ.25 లక్షల విరాళం

ఆంధ్రప్రదేశ్ లో  ఇటీవల  సంభవించిన వరదల్లో నష్టపోయిన బాధితులను ఆదుకునే నిమిత్తం ఏర్పాటు చేసిన ఏపీ సీఎం సహాయ నిధికి ఉత్తర అమెరికా ఎన్నారై  టీడీపీ శ్రేణులు రూ.25 లక్షల విరాళాన్ని అందజేశాయి. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును  డల్లాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ డా. పెమ్మసాని చంద్రశేఖర్‌కు అందజేశారు. పార్టీ కోసమే గాక, ప్రజల కోసం కూడా పరితపించే కార్యకర్తలు కేవలం టీడీపీకే సొంతమని డా. పెమ్మసాని పేర్కొన్నారు. ఈ విరాళాలు అందజేసినవారికి ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News