Skip to main content

Namaste NRI

కొత్త చట్టంపై సంతకం చేసిన జో బైడెన్‌

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. కొందరు ఉన్మాదులు సృష్టిస్తున్న ఘోర కలికలతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. నిత్యం ఏదో ఒక చోట కాల్పుల మోత మోగుతూనే ఉంటుంది. ఈ ఘటనల్లో ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నారులు సైతం ఈ సంస్కృతికి బలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తుపాకీ సంస్కృతిని అంతం పలికేందుకు అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక ముందడుగు వేశారు. ఈ మేరకు హింసకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.

ఈ విషయాన్ని అధ్యక్షుడే స్వయంగా వెల్లడించారు. అమెరికాలో వ్యాధులు, ప్రమాదాల వల్ల మృతి చెందుతున్న చిన్నారుల కంటే, తుపాకీల కారణంగా చోటుచేసుకుంటున్న మృతుల సంఖ్యే ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హింసను అంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. తుపాకీ హింసను అరికట్టేందుకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ పై సంతకాలు చేసినట్లు బైడెన్‌ వెల్లడించారు.

Social Share Spread Message

Latest News