Namaste NRI

సింగపూర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌ తో భేటీ అయ్యారు. గ్రీన్‌ ఎనర్జీ, మూసీ పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, ఐటీ, నైపుణ్య నిర్మాణంపై వారు చర్చించారు. గురువారం రాత్రి రేవంత్‌రెడ్డి బృందం ఢల్లీి నుంచి బయలుదేరి సింగపూర్‌ వెళ్లింది. శుక్రవారం ఉదయం వివియన్‌ బాలకృష్ణన్‌తో వారు భేటీ అయ్యారు. ఆ దేశంలోని అభివృద్ధి పనులతో పాటు తెలంగాణలోని ప్రణాళికలపై ప్రధానం గా చర్చించారు. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ, దానుకున్న అవకాశాలపై చర్చ జరిపారు. సింగపూర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు, రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను పోల్చి చూశారు. నిధుల సమీకరణ గురించి సమాలోచనలు చేశారు. ఈ భేటీలో సీఎంతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News