Namaste NRI

ప‌ద్మ భూష‌ణ్ అవార్డ్ అందుకున్న బాల‌య్య‌

2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవం  ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సినిమా రంగానికి గాను విశేష సేవ‌లు అందించిన ప్ర‌ముఖుల‌కి ప్ర‌తిష్టాత్మ‌క అవార్డులు అందించారు. ప్రముఖ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును రాష్ట్రప‌తి చేతుల మీదుగా అందుకున్నారు. తెలుగుద‌నం ఉట్టిప‌డేలా బాల‌య్య ప‌ద్మ అవార్డుల కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. వార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి కుమారుడు మోక్షజ్ఞ, కూతురు తేజస్విని, భార్య వసుందర, మంత్రి నారా లోకేష్ దంపతులు హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News