సుప్రసిద్ధ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా పతాకాల పై నాగ్ అశ్విన్ నిర్మించిన విభిన్న తరహా చిత్రం సింగ్ గీతం. అయాన్, అహల్య బమ్రూ, శాలినీ కొండెపుడి కీలక పాత్రల పోషించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరాలందించారు. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్ మాట్లాడారు.నేను యంగ్స్టర్గా ఉన్నప్పుడు సింగీతం నాకు రెండు కథలు చెప్పారు. అందులో ఒకటి పుష్పక విమానం గా వచ్చింది. ఇప్పుడు రెండో కథ సింగ్ గీతంగా రాబోతున్నది. నాకిప్పుడు 70ఏళ్లు. ఇప్పుడు ఈ సినిమా చూడబోతున్నాను అని ఆనందం వెలిబుచ్చారు. సింగీతం కథలు ఏజ్లెస్గా ఉంటాయి. సింగీతం ఇప్పటికీ జెన్జీ కంటే ముందుంటారు. వైజయంతీ, స్వప్నా సంస్థలు ప్యాషన్తో ఈ సినిమాను నిర్మించారు. పుష్పక విమానం లా ఈ సినిమా కూడా ఊహించని విజయాన్ని సాధిస్తుందని నమ్మకంగా చెబుతున్నా అని కమల్హాసన్ పేర్కొన్నారు.

సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ మాటలే పాటలైతే ఎలా ఉంటుంది? అనే ప్రశ్న నుంచి ఈ కథ పుట్టింది. ఈ సినిమా నా 40ఏళ్ల కల. ఈ కథ ఎంతో మందికి వినిపించాను. వైజయంతీ బ్యానర్పై నాగ్ అశ్విన్ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకోవడం దైవనిర్ణయం. ఈ సినిమాకు దర్శకుడ్ని నేనే అయినా, నాగ్ అశ్విన్ తన భుజాన వేసుకొని ఈ చిత్రాన్ని ముందుకు నడిపించారు. ఈ సినిమాకు చెందిన క్రెడిట్ నాగ్అశ్విన్కే దక్కుతుంది. దేవిశ్రీ ఈ కథ ఆత్మను పట్టుకొని అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఆయన తప్ప ఇంకెవరూ ఇంత అద్భుతమైన సంగీతం అందించలేరు అని తెలిపారు. ఈ నెల 11న సినిమా విడుదల కానున్నది.





























