Skip to main content

Namaste NRI

సందీప్‌ కిషన్‌ మైఖేల్‌ మూవీ నుండి క్రేజీ అప్‌డేట్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ నటుడిగానే కాకుండా నిర్మాత‌గా కూడా స‌క్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘మైఖేల్‌’ ఒకటి.  ఈ సినిమాలో సందీప్‌కు జోడీగా దివ్యాంశ కౌశిక్‌ నటిస్తుంది. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నాడు.  ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ ఎల్ఎల్‌పి,క‌ర‌ణ్ సి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై పుస్కుర్‌ రామ్‌మోహ‌న్ రావు, భ‌ర‌త్ చౌద‌రీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజైన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ మరో అప్‌డేట్‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు.

ఈ మూవీలోని ఫస్ట్‌ సింగిల్‌ను డిసెంబర్‌ 28న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. సామ్‌ సీఎస్‌ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. తమిళ నటి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, వ‌రుణ్ సందేష్ కీల‌క‌పాత్రల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events