మన సంస్కృతీ సంప్రదాయాలను మరచిపోకుండా తెలుగు ప్రజలు మన పండగలను విదేశాలలో అత్యంత వైభవంగా నిర్వహించుకొంటున్నారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగరంలో శ్రీస్వామినారాయణ్ (అక్షరధామ్) ఆలయంలో తెలుగు ప్రవాసులు దీపావళి వేడుకలు వైభవంగా నిర్వహించారు. బాణసంచా, తారాజువ్వల వెలుగుల్లో ఆలయ ప్రాంగణం కనువిందు చేసింది. పండగ విశేషాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తమ బంధుమిత్రులతో వీడియోలు , ఫొటోల ద్వారా పంచుకున్నారు.














